తెలంగాణ

telangana

అండర్​-19: జైస్వాల్, అథర్వ అదరహో.. ఆసీస్ లక్ష్యం 234

అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న క్వార్టర్ ఫైనల్​ మ్యాచ్​లో యువ భారత్ తడబడినా చివరికి నిలబడింది. 234 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. యువ టీమిండియాలో యశస్వి, అథర్వ అర్ధ శతకాలతో రాణించారు.

By

Published : Jan 28, 2020, 5:47 PM IST

Published : Jan 28, 2020, 5:47 PM IST

Updated : Feb 28, 2020, 7:29 AM IST

ETV Bharat / sports

అండర్​-19: జైస్వాల్, అథర్వ అదరహో.. ఆసీస్ లక్ష్యం 234

India U19 vs Australia U19, Super League Quarter-Final 1
అండర్​-19 ప్రపంచకప్​: నాకౌట్​ పోరులో యువ భారత్​కు పరీక్ష

దక్షిణాఫ్రికా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అండర్​ 19 ప్రపంచకప్​ క్వార్టర్​ ఫైనల్ మ్యాచ్​లో.. భారత్​ ఫర్వాలేదనిపించింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు​ దిగిన యువ భారత్​ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

యశస్వి మరోసారి...

టోర్నీలో నిలకడగా రాణిస్తున్న భారత ఆశాకిరణం యశస్వి జైస్వాల్​ మరోసారి సత్తా చాటాడు. ఓపెనర్​గా బరిలోకి దిగి 62 పరుగులు( 82 బంతుల్లో ; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. మిగిలిన బ్యాట్స్​మన్లలో సక్సేనా(14), తిలక్​ వర్మ(2), ప్రియమ్​ గార్గ్​(5), ధ్రువ్​ జురెల్​(15) నిరాశపర్చారు.

ఆదుకున్న అథర్వ...

144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. నామమాత్రపు స్కోరుకు తీసుకెళ్లడంలో ఆల్​రౌండర్​ అథర్వ కీలకంగా ఉపయోగపడ్డాడు. మరో ఎండ్​లో బౌలర్లు బిష్ణోయ్​(30) సహకారంతో అర్ధశతకం చేశాడు. అథర్వ 55 పరుగులు (54 బంతుల్లో ; 5 ఫోర్లు, 1 సిక్సర్​) సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

యువ టీమిండియాలో బిష్ణోయ్‌, కార్తీక్‌ త్యాగి, ఆకాశ్‌సింగ్‌, అథర్వలతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. వీరు రాణిస్తే భారత్​ ప్రపంచకప్​ రేసులో ఉంటుంది. లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను భారత్‌ ప్రధానాస్త్రంగా ప్రయోగించనుంది. ఇప్పటిదాకా బిష్టోయ్‌ 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి ప్రపంచకప్‌లో ప్రభావవంతమైన బౌలర్‌గా ఎదిగాడు.

Last Updated : Feb 28, 2020, 7:29 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details