తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ను కట్టడి చేసిన భారత బౌలర్లు.. లక్ష్యం 147

గయానా వేదికగా భారత్​తో జరుగుతోన్న మూడో టీ-20లో విండీస్ 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్(58) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. చివర్లో రోవ్​మాన్ పావెల్(32) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లు దీపక్ చాహర్ 3, సైనీ రెండు వికెట్లు తీశారు.

By

Published : Aug 7, 2019, 12:23 AM IST

దీపక్​ చాహర్

భారత్​తో జరుగుతున్న మూడో టీ 20లో వెస్టిండీస్ 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. గయానా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​ టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ బ్యాట్స్​మెన్​లో కీరన్ పొలార్డ్(58), పావెల్(32) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3, నవదీప్ సైనీ 2 వికెట్లతో రాణించారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన విండీస్ ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ నరైన్(2) వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్​లో సైనికి క్యాచ్​ ఇచ్చాడు నరైన్. అనంతరం కాసేపటికే లూయిస్(10)​, హిట్మైర్(1) వికెట్లు కోల్పోయింది విండీస్ జట్టు.14 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్.. నికోలస్ పూరన్(17) సాయంతో స్కోరు బోర్డు ముందుకు కదిలించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు, ఓ ఫోర్ ఉన్నాయి. అనంతరం సైని బౌలింగ్​లో బౌల్డ్ అయ్యాడు.

పొలార్డ్​ ఔటైన తర్వాత విండీస్ ఆటగాళ్లు నెమ్మదించినా.. ఆఖర్లో దూకుడుగా ఆడారు. ఆరంభంలో పరుగులు కట్టడి చేసిన భారత బౌలర్లు చివర్లో సమర్పించుకున్నారు. విండీస్ బ్యాట్స్​మన్ పోవెల్(30) సిక్సర్లతో విరుచుకుపడి అనుకున్నకంటే ఎక్కువ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

అదరగొట్టిన దీపక్​..

కెరీర్​లో రెండో టీ 20 ఆడుతున్న దీపక్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తను వేసిన తొలి ఓవర్లోనే సునిల్ నరైన్​ను ఔట్ చేశాడు. అనంతరం ఒకే ఓవర్లో లుయిస్, హిట్మైర్​ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ చేర్చాడు.

ఇది చదవండి: రెండో టీ20లో రికార్డులే రికార్డులు..!

ABOUT THE AUTHOR

...view details