తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ బౌలింగ్​.. జట్టులోకి సూర్యకుమార్, ఇషాన్

నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టీ20లో భారత్​ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​తో యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తున్నారు.

By

Published : Mar 14, 2021, 6:33 PM IST

Updated : Mar 14, 2021, 6:55 PM IST

ind vs eng: 2nd t20 match toss
రెండో టీ20: భారత్​ బౌలింగ్​.. జట్టులోకి సూర్యకుమార్, ఇషాన్

అహ్మదాబాద్​ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య జరగుతున్న రెండో టీ20​లో టాస్​ గెలిచిన టీమ్​ఇండియా బౌలింగ్​ ఎంచుకుంది. తొలి మ్యాచ్ ఓటమి నేపథ్యంలో కొద్ది పాటి మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. శిఖర్​ ధావన్, అక్షర్​ పటేల్​ను పక్కనపెట్టింది. వారి స్థానంలో ఈ మ్యాచ్​తో యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తున్నారు.

ఇంగ్లాండ్​ కూడా జట్టులో స్వల్ప మార్పులు చేసింది. మార్క్​వుడ్​ స్థానంలో టామ్​ కరన్​ను టీమ్​లో చేర్చుకుంది.

జట్లు:

భారత్​: కేఎల్​ రాహుల్​, ఇషాన్ కిషన్​, విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్​ (వికెట్​ కీపర్​), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్​ సుందర్​, భువనేశ్వర్​ కుమార్​, శార్దూల్​ ఠాకూర్​, యుజ్వేంద్ర చాహల్​.

ఇంగ్లాండ్​:జేసన్​ రాయ్​, జోస్​ బట్లర్​ (వికెట్​ కీపర్), డేవిడ్​ మలన్​, జానీ బెయిర్​స్టో, ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, సామ్​ కరన్​, జోఫ్రా ఆర్చర్​, క్రిస్​ జోర్డాన్​, ఆదిల్​ రషీద్​, టామ్ కరన్.

ఇదీ చూడండి:రెండో టీ20: కసితో కోహ్లీసేన- ధీమాగా ఇంగ్లాండ్

Last Updated : Mar 14, 2021, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details