తెలంగాణ

telangana

ETV Bharat / sports

లక్ష్మణ్​ లాగా అదీ నా మాట వినట్లేదు: గంభీర్​

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​ లాగే తన ఇంట్లో గడ్డి కూడా తన మాట వినట్లేదన్నాడు మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​. మూడు రోజుల నుంచి నీరు పోస్తున్నా ఏ మాత్రం పెరగలేదని విచారం వ్యక్తం చేశాడు.

By

Published : Apr 17, 2020, 12:11 PM IST

Gautam Gambhir trolls VVS Laxman while describing his routine during lockdown
లక్ష్మణ్​ లాగా అదీ నా మాట వినట్లేదు: గంభీర్​

కరోనా లాక్​డౌన్​ కారణంగా క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో​ తన ఇంటిలోని గార్డెన్​ను సంరక్షిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​, లోక్​సభ సభ్యుడు గౌతమ్​ గంభీర్. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​ లాగా తన ఇంట్లో గడ్డి కూడా తన మాట వినట్లేదని అన్నాడు.

"లాక్​డౌన్​లో ఇంటి ప్రాంగణంలోని మొక్కల్ని సంరక్షించాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. వాటికి రోజూ నీరు పోస్తున్నా. ఆశ్చర్యం ఏమిటంటే.. మూడు రోజుల నుంచి నీరు పోస్తున్నా.. గడ్డి పెరగడం లేదు. లక్ష్మణ్​ లాగా గడ్డి కూడా నా మాట వినటం లేదు."

-గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

దిల్లీలో కరోనా కట్టడి కోసం ఇటీవలే భారీ విరాళం ప్రకటించాడు గంభీర్​. తూర్పు దిల్లీ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్.. తన ఎంపీల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలతో పాటు పీపీఈ కిట్లను ప్రభుత్వానికి అందించాడు.

ఇదీ చూడండి.. ఆసీస్ పర్యటనకు వెళితే భారత జట్టుకు ఆ హోటల్

ABOUT THE AUTHOR

...view details