తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనికి రాంచీ వన్డేనే చివరిదా..!

చివరి రెండు వన్డేలకు మహీ దూరం కానున్నాడు. కాలి గాయంతో షమీ కూడా అందుబాటులో ఉండట్లేదు.

By

Published : Mar 9, 2019, 10:10 AM IST

మహేంద్రసింగ్ ధోనీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్​లో మహేంద్రసింగ్ ధోనీ చివరి రెండు మ్యాచ్​లకు దూరం కానున్నాడు. త్వరలో ప్రపంచకప్ జరగనున్న తరుణంలో మహీకి విశ్రాంతినిచ్చింది జట్టు యాజమాన్యం. ధోనీ స్థానంలో రిషబ్ పంత్ వికెట్​ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాలి గాయంతో మహ్మద్​ షమీ కూడా అందుబాటులో ఉండట్లేదు.

" చివరి రెండు వన్డేల్లో కొన్ని మార్పులు చేయబోతున్నాం. ధోనీకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం."
--సంజయ్​ బంగర్, భారత జట్టు సహాయక కోచ్

ప్రపంచకప్​ అనంతరం మహీ రిటైర్​మెంట్ ప్రకటిస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై ధోనికి రాంచీ వన్డేనే చివరి మ్యాచ్​ కానుంది. అంతేకాదు స్వదేశంలో టీమిండియాకు అక్టోబరు వరకు మ్యాచ్​లు లేవు.

వచ్చే సీజన్​లో మహీ ఆడతాడని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ నమ్మంకగా ఉంది. స్వదేశంలో జరిగే మ్యాచ్​ల్లో ధోనీకి ఘనమైన వీడ్కోలు పలుకుతామని విశ్వసిస్తుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details