తెలంగాణ

telangana

By

Published : May 7, 2020, 1:40 PM IST

Updated : May 7, 2020, 3:16 PM IST

ETV Bharat / sports

వార్నర్ 'ఐపీఎల్ జట్టు'లో యువరాజ్​కు దక్కని చోటు

తన 'ఆల్​టైమ్ ఐపీఎల్ ఎలెవన్​'ను వెల్లడించాడు ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇందులో యువరాజ్ సింగ్​కు చోటు దక్కలేదు.

వార్నర్ ఐపీఎల్ జట్టులో యువరాజ్​కు దక్కని చోటు
ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

సన్​రైజర్స్ హైదరాబాద్​ స్టార్ బ్యాట్స్​మన్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్​లో తన ఆల్​టైమ్ జట్టును చెప్పాడు. ప్రముఖ కామెంటేటర్​ హర్ష భోగ్లేతో జరిగిన లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడు. అయితే ఇందులో భారత్​కు చెందిన ఎనిమిది మంది క్రికెటర్లు ఉండగా, యువరాజ్ సింగ్​కు చోటు దక్కలేదు.

ఈ జట్టులో రోహిత్​ శర్మ, తాను ఓపెనర్లు అని చెప్పిన వార్నర్.. మూడో స్థానంలో కోహ్లీ, నాలుగు-ఐదు-ఆరులో వరుసగా రైనా, హార్దిక్ పాండ్య, మ్యాక్స్​వెల్​కు స్థానం కల్పించాడు. ఏడో స్థానంతో పాటు వికెట్​ కీపర్​గా ధోనీ ఎంచుకున్నాడు. ఆ తర్వాత స్టార్క్(8), నెహ్రా(9), బుమ్రా(10), కుల్దీప్/చాహల్(11)లకు చోటిచ్చాడు.

Last Updated : May 7, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details