తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2020, 7:52 PM IST

Updated : Jun 11, 2020, 8:04 PM IST

ETV Bharat / sports

శ్రీలంకతో భారత్​ పరిమిత ఓవర్ల సిరీస్​ వాయిదా

భారత్​, శ్రీలంక మధ్య జూన్​-జులైలో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్​ను వాయిదా పడినట్లు అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) తెలిపింది. కరోనా వ్యాప్తి కారణంగా ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు చర్చించి ఈ సిరీస్​ను వాయిదా వేసుకున్నాయని బీసీసీఐ కోశాధికారి తాజాగా వెల్లడించారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.

COVID-19: India's tour of Sri Lanka not to go ahead
శ్రీలంకతో భారత్​ పరిమిత ఓవర్ల సిరీస్​ వాయిదా

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టు శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ట్విట్టర్​లో వెల్లడించింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రీడాకారులను శ్రీలంక పర్యటనకు పంపడం సాధ్యం కాదంటూ బీసీసీఐ శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు తెలిపినట్టు సమాచారం. శ్రీలంకతో జూన్-జులైలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమ్​ఇండియా వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడినట్టు ఐసీసీ తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్​ ధ్రువీకరించారు.

"జూన్​-జులైలో శ్రీలంక పర్యటనకు భారత్​ వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రస్తుత సంక్షోభ సమయంలో సిరీస్​ నిర్వహించడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చాం. అయితే ఈ టోర్నీని ఆగస్టులో నిర్వహించాలని యోచిస్తున్నాం".

-అరుణ్​ ధుమాల్​, బీసీసీఐ కోశాధికారి.

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రీడోత్సాహానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో భారత్‌ × శ్రీలంక మ్యాచ్‌లు వాయిదా పడిన వార్త తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని పేర్కొంటూ పలువురు క్రీడాభిమానులు సోషల్​మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి... ఆ షాట్లను మిస్ అవుతున్నా: రోహిత్

Last Updated : Jun 11, 2020, 8:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details