తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 5:46 AM IST

ETV Bharat / sports

అక్టోబరులో బంగ్లాదేశ్-శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్​!

టీ20 ప్రపంచకప్ వాయిదా కారణంగా శ్రీలంకలో బంగ్లాదేశ్​ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

Bangladesh's Test tour to Sri lanka could be rescheduled to October
బంగ్లాదేశ్-శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్​

బంగ్లాదేశ్​-శ్రీలంక మధ్య మూడు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్​ ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడటం వల్ల.. అ సమయంలోనే బంగ్లా లంకలో పర్యటించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇరు దేశాల బోర్డుల మధ్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఓ తేదీ నిర్ణయించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

తొలుత ఈ టెస్టు సిరీస్​ను జులై-ఆగస్టు మధ్య నిర్వహించాలని అనుకున్నారు. కానీ వైరస్​ వల్ల వాయిదా పడింది.

ఇదే కాకుండా ఐర్లాండ్​తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్​ను రీషెడ్యూల్​ చేసే ఆలోచనలో ఉంది బంగ్లా బోర్డు. కరోనా తగ్గుముఖం పట్టగానే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో పర్యటించేలా మరిన్ని టోర్నీలకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇది చూడండి : దుబాయ్​ ఎయిర్​లైన్స్​తో బీసీసీఐ చర్చలు

ABOUT THE AUTHOR

...view details