తెలంగాణ

telangana

ETV Bharat / sports

పట్టుబిగిస్తున్న ఆసీస్​.. ఇరకాటంలో ఇంగ్లాండ్

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న యాషెస్​ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్​లో భారీ స్కోరు చేసిన ఆసీస్ బంతితోనూ ఆకట్టుకుంటోంది. హెజిల్​వుడ్ 4 వికెట్లతో విజృంభించాడు. మూడో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్​  5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

By

Published : Sep 7, 2019, 7:55 AM IST

Updated : Sep 29, 2019, 6:00 PM IST

యాషెస్​

యాషెస్ నాలుగో టెస్టు ఆస్ట్రేలియా వైపు మొగ్గుతోంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​​లో ఇంగ్లాండ్ 200 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ జాష్ హెజిల్​వుడ్ 4 వికెట్లతో విజృంభించాడు. ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ రోరీ బర్న్స్(81)​, జోయ్ రూట్(71) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు.

4 వికెట్లు తీసిన హెజిల్​వుడ్​

వర్షం వల్ల మూడోరోజు ఉదయం సెషన్​ అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఓవర్​నైట్ స్కోరు 23/1 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు ఆరంభంలోనే క్రేగ్ ఓవర్టన్(5) వికెట్ కోల్పోయింది. ఇలాంటి తరుణంలో బర్న్స్​ - రూట్​ జోడి ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్ ముందుకు నడిపించింది. వీరిద్దరూ 141 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.

నిలకడగా ఆడుతున్న బర్న్స్​ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు హెజిల్​వుడ్​. అదే ఊపులో రూట్​ను కూడా ఔట్​ చేసి ఇంగ్లాండ్​ను దెబ్బతీశాడు. అనంతరం జేసన్​ రాయ్​నూ పెవిలియన్​కు పంపాడు. మూడోరోజు ఓవర్టన్​తో మొదలైన వికెట్ల పతనాన్ని జేసన్​రాయ్​తో ముగించాడు హెజిల్​వుడ్​. 166/2 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ హెజిల్​వుడ్​ దెబ్బకు కుదేలైంది.

బ్యాటింగ్ చేస్తున్న రూట్

వర్షం కారణంగా మూడో రోజు ఆట 64 ఓవర్లే సాధ్యమైంది. ప్రస్తుతం బెన్ స్టోక్స్​(7), బెయిర్​స్టో(2) క్రీజులో ఉన్నారు. వీరిద్దరిపైనే ఇంగ్లీష్ జట్టు ఆశలు పెట్టుకుంది.

నాలుగో టెస్టులో క్రమంగా పట్టుబిగిస్తోంది ఆసీస్. తొలి ఇన్నింగ్స్​లో 497/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది కంగారూ జట్టు. స్టీవ్ స్మిత్(211) డబుల్ సెంచరీతో మరోసారి ఆదుకున్నాడు.

ఇదీ చదవండి: మలింగనా మజాకా.. 4 బంతుల్లో 4 వికెట్లు..!

Last Updated : Sep 29, 2019, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details