తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2019, 7:08 PM IST

ETV Bharat / sports

సెలక్షన్​ విషయంలో దాదా థియరీకి రహానే జై

క్రికెట్​లో మూడు ఫార్మాట్లకు స్థిరమైన ఆటగాళ్లను ఎంపిక చేయాలన్న గంగూలీ వ్యాఖ్యలను సమర్థించాడు టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే. టెస్టుల్లో సత్తాచాటే వారు అన్ని ఫార్మాట్లలోనూ మంచి ప్రదర్శన చేయగలరని చెప్పాడు.

రహానే

ప్రపంచకప్​ తర్వాత జట్టుకు సరైన ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంపై సెలక్టర్లు దృష్టిసారించాలని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో అజింక్య రహానేను కేవలం టెస్టులకే పరిమితం చేయడంపై భారత జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీతో పాటు పలువురు అసహనం వ్యక్తం చేశారు. జట్టు విజయవంతం కావాలంటే మూడు ఫార్మాట్లకు స్థిరమైన ఆటగాళ్లు ఉండాలని చెప్పారు. స్పందించిన రహానే.. గంగూలీ వ్యాఖ్యలతో ఏకీభవీస్తున్నానని అన్నాడు.

"జట్టులో స్థిరంగా ఉండటం ముఖ్యం. మూడు ఫార్మాట్లకు కోర్​ గ్రూప్​ ఉంటే బాగుంటుంది. ఒక ఆటగాడికి సరైన అవకాశాలు లభిస్తే అతడిపై అతడికి నమ్మకం పెరుగుతుంది. అన్ని ఫార్మాట్లకు ఎంపికైతే బాధ్యత పెరిగి సరిగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. 3, 4 నెలలు ఆటకు దూరమైతే లయ దెబ్బతిని స్థిరత్వం లోపిస్తుంది. టెస్టు మ్యాచ్​లు ఎవరైతే బాగా ఆడతారో వారు అన్ని ఫార్మాట్లలోనూ సత్తాచాటగలరు".
-అజింక్య రహానే, టీమిండియా ఆటగాడు

ప్రస్తుతమున్న యువ ఆటగాళ్లతో పోలిస్తే తన ఆటతీరు భిన్నంగా ఉంటుందని తెలిపాడు రహానే. ఎల్లప్పుడూ తనను తాను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటానని స్పష్టం చేశాడు. టెస్టులు, టీ20లు భిన్నమైనవని, ఈ రెండు ఫార్మాట్లలో ఆడేటపుడు షాట్ల ఎంపికపై జాగ్రత్త వహించాలని చెప్పాడు.

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్​లో హాంప్​షైర్ తరఫున ఆడిన రహానే... విండీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. కరీబియన్ గడ్డపై జరిగే టెస్టులకు వైస్ కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో చివరగా వన్డే మ్యాచ్​ ఆడిన ఈ ఆటగాడు... అన్ని ఫార్మాట్లలోనూ సత్తాచాటగలనని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి.. ధోనీ రాకకై ఎదురు చూస్తున్న సర్​ఫ్రైజ్​

ABOUT THE AUTHOR

...view details