తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2021, 6:43 PM IST

ETV Bharat / sports

ఒలింపిక్స్​లోకి క్రికెట్​ ఎంట్రీ అప్పుడే.. భారత్​ వెళ్తుందా?

ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చే అవకాశాలున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) స్పందించింది. విశ్వక్రీడల్లో భారత్​ పాల్గొంటుందా? లేదా? అనే విషయంపై బీసీసీఐ కార్యదర్శి (BCCI Secretary) జై షా స్పష్టత ఇచ్చారు.

BCCI
బీసీసీఐ

ఒలింపిక్స్​లో అన్ని క్రీడలు కనిపిస్తాయి. కానీ, క్రికెట్​కు మాత్రం చోటు లేదు. దీంతో జెంటిల్మెన్​ గేమ్​ను కూడా విశ్వక్రీడల్లో చేర్చాలనేది అభిమానుల నుంచి గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్. 2028 లాస్​ ఏంజెలెస్​​ ఒలింపిక్స్​లో (Los Angeles Olympics 2028) ఇది సాధ్యం కావొచ్చు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ (BCCI Secretary) కార్యదర్శి జై షా స్పందించారు. అదే జరిగితే ఆ మెగా ఈవెంట్​లో భారత్​ పాల్గొంటుందని వెల్లడించారు.

ఈ విషయమై ఇంతకుముందే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో ఐసీసీ చర్చలు జరిపింది. కానీ, అప్పుడు బీసీసీఐ (BCCI) సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ముగిశాయి. కానీ, ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టత ఇచ్చారు. క్రికెట్​ విశ్వక్రీడల్లో భాగమైతే భారత్​ పాల్గొంటుందని వెల్లడించారు. ఇందులో ఐసీసీతో కలిసి సాగుతామని పేర్కొన్నారు.

''టోక్యో ఒలింపిక్స్​లో భారత బృందం ప్రదర్శనపై బీసీసీఐ సంతోషంగా ఉంది. దీంతో బీసీసీఐ తన వైఖరిని మార్చుకుంది. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని.. భారత్​కు మరిన్ని పతకాలు రావడానికి కృషి చేయాలని బోర్డు భావిస్తున్నట్లు'' అధికారి ఒకరు తెలిపారు.

1900 పారిస్ ఒలింపిక్స్​లో తొలిసారిగా ఈ జెంటిల్మెన్​ గేమ్​కు అవకాశమిచ్చారు. ఇందులో ఫ్రాన్స్​, గ్రేట్​ బ్రిటన్​ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్​లో గ్రేట్​ బ్రిటన్​ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్​ టీమ్​కు రజతం దక్కింది. రెండే టీమ్​లు పాల్గొనడం వల్ల కాంస్య పతకానికి అవకాశం లేకుండా పోయింది.

టీ20లతో సాధ్యమే..

లాస్​ ఏంజెలెస్​​ ఒలింపిక్స్​లో ఐసీసీ ఎనిమిది జట్లను బరిలో దించే అవకాశముంది. ప్రస్తుతమైతే టీ20 మ్యాచ్​లు నాలుగు గంటల్లో ముగుస్తున్నాయి. 2028 వరకు వీలైతే అతిచిన్న ఫార్మాట్​ను కూడా సృష్టించొచ్చు.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details