తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 10:57 PM IST

ETV Bharat / sports

ఆ కోచ్​ వల్లే నా ఆట మెరుగైంది: సింధు

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పసిడి గెలిచిన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు... తన గెలుపు వెనుక ఓ విదేశీ కోచ్​ సాయం ఉందని వెల్లడించింది. ఎన్నోసార్లు ఫైనల్లో బోల్తాపడుతున్న తనకు ఆ శిక్షకురాలి సూచనలు బాగా పనిచేశాయని చెప్పుకొచ్చింది.

ఆ కోచ్​ వల్లే నా ఆట మెరుగైంది: సింధు

ఎన్నో ఏళ్లుగా ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పసిడి గెలవాలని కోరుకుంటున్న భారత క్రీడాకారులకు ప్రతిసారి నిరాశే ఎదురైంది. కానీ తొలిసారి ఆ కలను నెరవేర్చి టైటిల్​ను​ ముద్దాడింది తెలుగుతేజం పీవీ సింధు. అయితే తన​ విజయం వెనుక ఓ విదేశీ శిక్షకురాలి​ సాయం కూడా ఉందంటూ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది.

సహాయ కోచ్​ కిమ్​ జి యున్​తో సింధు

" ప్రపంచ ఛాంపియన్​షిప్​ గెలవడంలో నాకు ఎంతో సహాయం చేసింది దక్షిణ కొరియా మాజీ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి కిమ్​ జి యున్​. ప్రస్తుతం ఆమె నాకు సహాయ కోచ్​గా ఉంది. కిమ్ సూచనలతోనే నా ఆట మరింత మెరుగైంది. కొన్ని నెలలుగా ఆమె భారత్‌లోనే ఉంటోంది. నా ఆటను గమనించి కొన్ని సూచనలు చేసింది. వాటిపై బాగా కసరత్తులు చేయించింది. అవే ఛాంపియన్‌‌షిప్‌లో నాకు బాగా ఉపయోగపడ్డాయి ".
- పీవీ సింధు, బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి

ప్రస్తుతం 2020 టోక్యో ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతోన్న ఈ తెలుగు తేజం... గోపీచంద్​ అకాడమీలో శిక్షణ పొందుతోంది. స్విట్జర్లాండ్​లోని బాసెల్​ వేదికగా ఇటీవల జరిగిన ఛాంపియన్‌‌షిప్‌ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో అలవోక విజయాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది.

ఇదీ చదవండి...

బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శికి షోకాజ్​ నోటీసులు..!

Last Updated : Sep 29, 2019, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details