తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2021, 8:24 AM IST

ETV Bharat / sitara

'మంచి సినిమా తీశాం.. ఆశీర్వదించండి'

తేజ సజ్జా, దక్ష నగార్కర్, ఆనంది ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జాంబీరెడ్డి'. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Zombie Reddy movie pre release event
'మంచి సినిమా తీశాం.. ఆశీర్వదించండి'

తేజ సజ్జా ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'జాంబీరెడ్డి'. 'అ!', 'కల్కీ' సినిమాల డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆనంది, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా హీరో వరుణ్‌ తేజ్ హాజరయ్యారు.

డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ, నిర్మాత రాజశేఖర్‌వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించామన్నారు. తెలుగులో వస్తున్న తొలి జాంబీ చిత్రమిదే. ఈ చిత్రానికి యూనిట్‌ సభ్యులంతా చాలా కష్టపడ్డట్లు వారు చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా తెలుగులో తాము కొత్త ప్రయోగంతో మంచి సినిమా తీశామని, అందరూ స్వాగతించి.. సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ తొలి టికెట్‌ను కొనుగోలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details