తెలంగాణ

telangana

By

Published : Oct 16, 2019, 6:04 PM IST

ETV Bharat / sitara

డ్రీమ్ గర్ల్​ హేమ మాలిని బుగ్గల్లా రోడ్లు: మంత్రి

మధ్యప్రదేశ్ న్యాయశాఖమంత్రి పీసీ శర్మ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు హేమామాలిని పేరు ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వం భోపాల్​ రోడ్లకు మరమ్మతులు చేయిస్తుందని.. అప్పుడు అవి హేమ మాలిని బుగ్గల్లాగా అందంగా మారతాయని అన్నారు.

డ్రీమ్ గర్ల్​ హేమ మాలిని బుగ్గల్లా రోడ్లు: మంత్రి

బాలీవుడ్​ నటి డ్రీమ్ గర్ల్​ హేమ మాలినిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ​ మంత్రి పీసీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంతలతో ఉన్న భోపాల్ రోడ్లు త్వరలోనే హేమ మాలిని బుగ్గల్లాగా అందంగా మారతాయని పేర్కొన్నారు. హబీబ్​గంజ్​ రైల్వేస్టేషన్​ సమీపంలోని రహదారులను మంత్రి వర్మతో కలిసి పరిశీలించిన పీసీ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఆదేశాలతో ప్రజాపనుల మంత్రి సజ్జన్​ ఆధ్వర్యంలో 15 రోజుల్లోనే రోడ్ల మరమ్మతులు పూర్తిచేస్తాం. 15 నుంచి 20 రోజుల్లో ఈ రోడ్లు హేమ మాలిని బుగ్గల్లా అందంగా తయారవుతాయి."
- పీసీ శర్మ, మధ్యప్రదేశ్ న్యాయశాఖమంత్రి

స్పోటకం మచ్చల్లా

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాష్​ విజయవర్గీయపైనా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లు.. కైలాష్​ బుగ్గలపైన ఉన్న స్పోటకం మచ్చల్లా ఉన్నాయని అన్నారు.

వాషింగ్టన్ రోడ్లకు ఏమైంది?

"రాష్ట్రంలో వాషింగ్టన్, న్యూయార్క్​ తరహాలో రోడ్లు నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చెప్పారు. అలా అయితే కేవలం ఒక్క వర్షంతోనే ఈ రోడ్లకు ఎందుకు గుంతలు పడ్డాయి" అని శర్మ ప్రశ్నించారు. గత భాజపా ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలని మంత్రి వర్మ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'బ్యాంకింగ్' పతనానికి వారిద్దరే కారణం: నిర్మల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details