తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2020, 6:19 AM IST

ETV Bharat / sitara

ధనుష్ 'అసురన్' కాంబో మరోసారి!

'అసురన్' కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన చేయనున్నారు.

మరోసారి ప్రేక్షకుల ముందుకు 'అసురన్' కాంబో!
మరోసారి ప్రేక్షకుల ముందుకు 'అసురన్' కాంబో!

తమిళంలో కొన్ని కాంబినేషన్లకు మంచి క్రేజ్ ఉంది. అందులో హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్​ది ఒకటి. వీరి కాంబోలో, గతేడాది వచ్చిన 'అసురన్' ఘన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి పనిచేయనున్నారని సమాచారం.

సూర్యతో 'వడివాసల్' తీస్తున్నారు వెట్రిమారన్. దీనికి కలైపులి ఎస్.థాను నిర్మాత. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ధనుష్​తో సినిమాను ప్రకటించనున్నారు.

సూర్యతో వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న వాడివాసల్ తమిళ నవల వాడి వాసల్ ఆధారంగా రూపొందిస్తున్నారు. జల్లికట్టు నేపథ్య కథ ప్రధానంగా ఉండనుంది. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు.

ABOUT THE AUTHOR

...view details