తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2021, 7:54 PM IST

ETV Bharat / sitara

Maheshbabu: బుర్రిపాలెంలో ముగిసిన టీకా డ్రైవ్

సూపర్​స్టార్​ మహేశ్​బాబు(Mahesh Babu) బుర్రిపాలెంలో చేపట్టిన వ్యాక్సినేషన్​ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చిన ప్రజలందరికీ మహేశ్​ బృందం కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు.

Maheshbabu
మహేశ్​బాబు

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh Babu) స్వస్థలం, దత్తత గ్రామం బుర్రిపాలెంలో (గుంటూరు జిల్లా) కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసింది. మే 31న సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి మహేశ్‌బాబు శ్రీకారం చుట్టారు. అప్పుడు మొదలైన ఈ ప్రక్రియ నేటితో ముగిసింది. బుర్రిపాలెంలో దాదాపు అందరూ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చిన బుర్రిపాలెం ప్రజలకు ఈ సందర్భంగా మహేశ్‌బాబు బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహేశ్‌బాబు, అందుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. పదిమంది ప్రాణాలు కాపాడేందుకు మహేశ్‌బాబు తలపెట్టిన ఈ కార్యక్రమంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. సెకండ్‌ వేవ్‌లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. జనం ఆక్సిజన్‌ కోసం, ఆసుపత్రిలో మంచాల కోసం ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ప్రజలను ఆదుకునేందుకు పలువురు సినిమా ప్రముఖులు ముందడుగు వేస్తున్నారు. మహేశ్‌బాబు.. తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు వేయించే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిసురేశ్‌ కథానాయిక. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 ప్లస్ రీల్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: నటి పాయల్ అవయవదానం.. ఆ సంఘటనే కారణం

ABOUT THE AUTHOR

...view details