తెలంగాణ

telangana

By

Published : Jun 21, 2019, 6:01 AM IST

ETV Bharat / sitara

ఒకేరోజు 10 సినిమాలు వస్తున్నాయి..!

ఈ రోజు ఏకంగా పది చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఏడు తెలుగు, మూడు అనువాద చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఫస్ట్​ ర్యాంక్​ రాజు, కబీర్ సింగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఒకేరోజు 10 సినిమాలు వస్తున్నాయి..!

శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమా బాగుంటే చూసేందుకు సిద్ధమవుతారు. అలాంటి వారి కోసం ఈ శుక్రవారం ఏకంగా పది సినిమాలు రాబోతున్నాయి. విశేషమేమిటంటే కబీర్​ సింగ్​ మినహా మిగతావన్నీ చిన్న సినిమాలే కావడం. ఇందులో తెలుగువి ఏడు, అనువాద సినిమాలు మూడు.

  • అర్జున్ రెడ్డి రీమేక్​గా రూపొందిన 'కబీర్ సింగ్'లో షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించారు
  • ఆసు యంత్రం కనిపెట్టిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మల్లేశం'. ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించాడు.
  • విద్యావ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలతో రూపుదిద్దుకున్న సినిమా 'ఫస్ట్​ ర్యాంక్ రాజు'. చేతన్ మద్దినేని హీరోగా నటించాడు.
  • హాస్యభరితంగా తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించాడు.
  • అడ్డంకుల్ని దాటుకుని విడుదలకు సిద్ధమైన సినిమా 'ఓటర్'. మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లు. రాజకీయ కథాంశంతో చిత్రాన్ని రూపొందించారు.
  • నటుడు అజయ్ ప్రధాన పాత్రలో.. పోలీస్​గా నటించిన సినిమా 'స్పెషల్'. వాస్తవ్ దర్శకుడు
  • క్రైమ్ థ్రిల్లర్​​గా తీసిన 'స్టువర్టుపురం'.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
  • హరినాథ్​ పోలిచర్ల స్వీయ దర్శకత్వంలో వస్తున్న 'కెప్టెన్ రాణా ప్రతాప్' సినిమా ఆర్మీ కథాంశంతో తెరకెక్కింది.
  • తమిళంలో ఆర్య నటించిన 'గజేంద్రుడు'. చింపాంజీ ప్రధాన పాత్రధారిగా తీసిన 'గొరిల్లా'.

ఇలా అన్ని సినిమాలు ఒకేరోజు రావడం వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది చూడాలో తెలియకప్రేక్షకులుగందరగోళానికి గురవుతారు.

ఇది చదవండి: రాజుగారి గది-3లో తమన్నా భయపెడుతుందా..!

ABOUT THE AUTHOR

...view details