తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 8:27 AM IST

ETV Bharat / sitara

నేడు ఏపీ సీఎం జగన్​తో సినీప్రముఖుల భేటీ

సినీ రంగ సమస్యలపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ భేటీ కానున్నారు. సినిమా రంగం అభివృద్ధిపై చర్చించనున్నారు.

jagan
jagan

లాక్ డౌన్ అమలులో సినీరంగ సమస్యలపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్​ను టాలీవుడ్ ప్రముఖులు కలువనున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు.. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సి.కల్యాణ్, జీవిత.. మరికొందరు సీఎంతో సమావేశం కానున్నారు.

సినిమాల షూటింగులు, నిర్మాణానంతర కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో సినిమా చిత్రీకరణకు అనుమతి వచ్చిన నేపథ్యంలో.. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి:ఓ ఇంటి కిటికీలోంచి తొంగి చూసిన చిరుత

ABOUT THE AUTHOR

...view details