తాప్సీ (Taapsee Pannu) నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'రష్మీ రాకెట్' (Rashmi Rocket). ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. కాగా.. ఈ సినిమా విడుదలపై బీటౌన్లో కొంతకాలంగా కాస్త ఆసక్తి నెలకొంది.
కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్ విడుదల కోసం మరికొంత కాలం ఎదురుచూస్తుందా అని చర్చలు సాగాయి. అయితే.. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఇప్పటికే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు పలు ఓటీటీ వేదికలతో చర్చలు కూడా జరుపుతున్నారట. మరికొన్ని రోజులో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.