తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దర్బార్ క్రేజ్​: చెన్నైలో ఫ్యాన్స్ రచ్చ.. రచ్చ

రజనీ నటించిన దర్బార్ చిత్రం హిట్ అవ్వాలని తమిళనాట అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చెన్నైలోని రోహిణి థియోటర్ ఎదుట సంబరాలు జరుపుకున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 7వేల థియేటర్లలో ఈ రోజు విడుదలైంది.

By

Published : Jan 9, 2020, 9:48 AM IST

Tamil Nadu: Fans of Rajinikanth gather and celebrate outside Rohini theatre in Chennai's Koyambedu
దర్బార్ చిత్రం

దర్బార్ విడుదల సందర్భంగా చెన్నైలో ఫ్యాన్స్ కోలాహలం

సూపర్​స్టార్ రజనీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్.. ఇక తమిళనాడులో అయితే చెప్పాల్సిన పనేలేదు. ఈ రోజు రజనీ నటించిన దర్బార్ చిత్ర విడుదల సందర్భంగా తమిళనాట అభిమానుల కోలాహాలం మొదలైంది. చెన్నైలోని రోహిణి థియేటర్ ఎదుట పెద్ద ఎత్తున సంబరాలు చేశారు.టపాసులు కాల్చి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు రజనీ అభిమానులు.

ప్రపంచవ్యాప్తంగా 7వేల థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించాలని విభిన్న రకాలుగా భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.

ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు రజనీ. నయనతార హీరోయిన్. నివేదా థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

ఇదీ చదవండి: నేచురల్​ స్టార్​కు అన్నగా జగపతిబాబు..?

ABOUT THE AUTHOR

...view details