దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితగాథ త్వరలో ‘తలైవి’గా వెండితెరపై సందడి చేయబోతోంది. బాలీవుడ్ స్టార్ కథానాయిక కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోంది. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగింది. అయితే ఇప్పుడీ విరామ సమయంలో చిత్ర బృందం ఎన్టీఆర్ కోసం వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్, శోభన్బాబు
జయలలిత జీవితగాథలో ఎంతో మంది రాజకీయ నాయకులతో పాటు ఆనాటి చిత్ర ప్రముఖులకు స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగులో ఆమె ఎన్టీఆర్, శోభన్బాబు వంటి అగ్ర కథానాయకులతో నటించిన నేపథ్యంలో సినిమాలో వాళ్ల పాత్రలకూ ప్రాధాన్యత ఉంది. అయితే శోభన్బాబు పాత్రకు జిషూ సేన్ను ఎంపిక చేసుకోగా.. ఎన్టీఆర్ పాత్ర ఎవరితో చేయించాలన్న చిక్కుముడి వీడటం లేదు.
బాలకృష్ణతో..