తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్షయ్ 'సూర్యవంశీ' షూటింగ్ ప్రారంభం

కిలాడీ హీరో అక్షయ్ పోలీస్​గా కనిపించనున్న 'సూర్యవంశీ' షూటింగ్ మొదలైంది. సంబంధిత ఫొటోను నిర్మాత కరణ్​ జోహార్ ట్విట్టర్​లో పంచుకున్నాడు

By

Published : May 6, 2019, 3:36 PM IST

అక్షయ్ 'సూర్యవంశీ' షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి మరో పోలీస్ సినిమా తీస్తున్నాడు. అక్షయ్ కుమార్​తో తెరకెక్కిస్తున్న 'సూర్యవంశీ' షూటింగ్​ ప్రారంభించాడు. సంబంధిత ఫొటోను చిత్ర నిర్మాత కరణ్​ జోహార్ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

ట్విట్టర్​లో కరణ్ జోహార్ పంచుకున్న ఫొటో

ఇప్పటికే ఈ దర్శకుడు అజయ్ దేవ్​గణ్​తో 'సింగం సిరీస్'​, రణ్​వీర్ సింగ్​తో 'సింబా' వంటి పోలీస్​ కథా నేపథ్యమున్న చిత్రాల్ని తెరకెక్కించాడు.

ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్​గా నటిస్తోంది. హీరోకు తల్లిగా నీనా గుప్తా కనిపించనుంది. మార్చిలో ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. 2020 ఈద్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇది చదవండి: 'సూర్యవంశీ'లో అక్షయ్​కు తల్లిగా నీనా గుప్తా

ABOUT THE AUTHOR

...view details