తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2020, 9:51 PM IST

ETV Bharat / sitara

ఇద్దరు నటులు, మాజీ ఎమ్మెల్యే కుమారుడికి సమన్లు

శాండల్​వుడ్​ డ్రగ్​ కేసు విచారణలో భాగంగా మరో ఇద్దరు నటులతో పాటు, మాజీ ఎమ్మెల్యే కుమారుడికి సీసీబీ సమన్లు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Sandalwood drug case
డ్రగ్​ కేసు

కన్నడ చిత్రపరిశ్రమలోని డ్రగ్స్​ కేసులో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. దర్యాప్తులో భాగంగా సినీ నటులు అకుల్​ బాలాజీ, సంతోశ్​ కుమార్ సహా​ మాజీ ఎమ్మెల్యే ఆర్​వీ దేవరాజ్​ కుమారుడు యువరాజ్​ను విచారణకు హాజరు కావాలని సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​ సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో కొంత సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే పైన సూచించిన వారిని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు సీసీబీ అధికారుల ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.

అకుల్​ బాలాజీ టెలివిజన్​ సీరియల్స్​తో పాటు, కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఇప్పటికే కేసుతో సంబంధమున్న సినీ నటి రాగిణి ద్వివేది, సంజన గల్రానీ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రేవ్​ పార్టీలకు మాదకద్రవ్యాలు సరఫరా చేశారని వీరిపై అభియోగాలు మోపారు.

ABOUT THE AUTHOR

...view details