తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అతిపెద్ద థియేటర్​ను ప్రారంభించిన 'అల్లూరి'

దేశంలోనే అతిపెద్ద సినిమా తెరతో కూడిన థియేటర్​ను రామ్​చరణ్​ ప్రారంభించాడు. నెల్లూరు జిల్లా సూళ్లురుపేటకు దగ్గరలో యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ దీనిని నిర్మించింది.

By

Published : Aug 29, 2019, 10:57 PM IST

Updated : Sep 28, 2019, 7:33 PM IST

రామ్​చరణ్​

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సందడి చేశాడు మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​తేజ. దేశంలోనే అతిపెద్ద సినిమా తెరతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్​ను ప్రారంభించాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ రూ. 40 కోట్లతో పిండిపాళెంలో ఈ థియేటర్​ను నిర్మించింది.

శుక్రవారం విడుదల కానున్న 'సాహో' చిత్రంతోనే ఈ థియేటర్లో షోలు ప్రదర్శితమవుతాయి. 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన తెర, 656 సీట్ల సామర్థ్యంతో 3డీ సౌండ్ సిస్టమ్​తో థియటర్​ను రూపొందించారు. ఇలాంటివి ఆసియా ఖండంలో మరో రెండు ఉన్నాయి.

ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో నటిస్తున్నాడు రామ్​చరణ్​. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ తార ఆలియాభట్‌ తెలుగు తెరకు పరిచయం అవుతుంది.

ఇది చదవండి: బెస్ట్​ ఫ్రెండ్ సీక్రెట్ చెప్పనున్న​ విజయ్​ దేవరకొండ!

Last Updated : Sep 28, 2019, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details