తెలంగాణ

telangana

By

Published : Dec 8, 2020, 6:09 PM IST

ETV Bharat / sitara

రైతులపై ప్రియాంక చోప్రా ట్వీట్​- నెటిజన్ల ఆగ్రహం

రైతులకు మద్దతుగా నిలవాలని పంజాబ్ సింగర్​ చేసిన ట్వీట్​ని రీట్వీట్​ చేసింది నటి ప్రియాంక చోప్రా. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరింది. ఈ తరుణంలో... నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్​ వేదికగా ట్రోల్ చేస్తున్నారు.

Priyanka Chopra gets trolled for lending support to farmers' protest
ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఆగ్రహం

దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న ఆందోళలనపై స్పందించింది నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె... డిసెంబర్​ 6న రైతుల ర్యాలీపై ట్వీట్​పై చేసింది. ప్రభుత్వం ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ట్వీట్​లో పేర్కొంది. పంజాబ్ సింగర్ దిల్జీత్ దోసంజే ట్వీట్​కు మద్దతుగా ఈ కామెంట్ చేసింది. అయితే ఈమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్ల ట్రోల్స్..

ప్రియాంక ట్వీట్​పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. 'కిసాన్​ అంటే అర్థం కూడా తెలియదు కానీ రైతులకు మద్దతుగా నిలుస్తానని చెబుతోంది. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని చెబుతోంది. అమెరికాలో ఉన్న ఆమెకు ఈ బిల్లులపై అసలు అవగాహన ఉంటుందా?. ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తోంది' అని ఓ నెటిజన్ ట్వీట్​ చేశాడు.

'నో టైమ్ ఫర్ ఫేక్ పీపుల్' అని కామెంట్ ఉన్న ఓ ఫొటోని ట్వీట్​లో జోడించాడు మరో నెటిజన్.

ఓ ఫన్నీ వైరల్ వీడియోని ప్రియాంక ట్వీట్​తో పోలుస్తూ ఓ యువతి కామెంట్ చేసింది.

ఇదీ చదవండి:ఈ ఏడాది ట్విట్టర్​లో సందడంతా ఈ ట్వీట్స్​దే!

ABOUT THE AUTHOR

...view details