తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2021, 3:09 PM IST

ETV Bharat / sitara

'నాపై యాసిడ్‌ దాడికి యత్నించారు.. భయంగా ఉంది'

కొందరు వ్యక్తులు తనపై యాసిడ్ దాడికి యత్నించారని నటి పాయల్ ఘోష్(Payal Ghosh Actress) ఆరోపించారు. దీనికి సంబంధించి చేతికి గాయాలయ్యాయని తెలుపుతూ ఇన్​స్టా వేదికగా ఓ పోస్ట్​ చేశారు.

payal ghosh
పాయల్ ఘోష్

గుర్తు తెలియని వ్యక్తులు తనపై యాసిడ్‌ దాడికి విఫలయత్నం చేశారని నటి పాయల్‌ ఘోష్‌(Payal Ghosh Actress) తెలిపారు. చేతికి గాయాలైన ఫొటోను ఇన్‌స్టా(Payal Ghosh News) వేదికగా షేర్‌ చేశారు.

"ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకువద్దామని చాలా రోజుల తర్వాత బయటకు వెళ్లాను. నా పనులన్నీ పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారు. ఆ సమయంలో నా చేతికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ల చేతుల్లో యాసిడ్‌ బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సంఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోంది. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది" అని పాయల్‌(Payal Ghosh Instagram) వివరించారు.

చేతికి స్వల్ప గాయాలతో నటి

'ప్రయాణం'తో కథానాయికగా తెలుగువారికి పరిచయమైన పాయల్‌.. 'ఊసరవెల్లి'లో సహాయనటిగానూ రాణించారు. అనుకున్నంతలో విజయాన్ని అందుకోలేకపోవడం వల్ల 'పటేల్‌ కీ పంజాబీ షాదీ'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. మరోవైపు గతేడాది ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై పాయల్‌ మీటూ ఆరోపణలు కూడా చేసింది.

నటి పాయల్ ఘోష్

ABOUT THE AUTHOR

...view details