తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2019, 7:45 AM IST

ETV Bharat / sitara

బాలీవుడ్​కు వెళ్లేందుకు సిద్ధమైన 'బేబీ'

సమంత ప్రధాన పాత్ర పోషించిన 'ఓ బేబీ' చిత్రం బాలీవుడ్​లో రీమేక్ కానుంది. సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. తెలుగులో జూలై 5న ఈ సినిమా విడుదల కానుంది.

బాలీవుడ్​కు వెళ్లేందుకు సిద్ధమైన 'ఓ బేబీ'

ఇటీవల వచ్చిన 'ఓ బేబీ' టీజర్​.. అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. సమంత ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్​కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రీమేక్​లో ఓ అగ్రకథానాయిక నటించనుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఓ వృద్ధురాలి ఆత్మ 20 ఏళ్ల యువతి శరీరంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అనే విభిన్న కథాంశంతో తెరకెక్కిందీ సినిమా. రావు రమేశ్, లక్ష్మి, నాగశౌర్య ఇతర పాత్రలు పోషించారు. కొరియన్ సినిమా 'మిస్​ గ్రానీ'కు రీమేక్​గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఓ బేబీ సినిమా పోస్టర్

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

ఇది చదవండి: 'ఆకారం తూనీగ.. ముట్టుకుంటే కందిరీగ'

ABOUT THE AUTHOR

...view details