తెలంగాణ

telangana

By

Published : Aug 2, 2020, 2:31 PM IST

ETV Bharat / sitara

'సుశాంత్​ కేసులో ముంబయి పోలీసుల్ని నమ్మలేం'

సుశాంత్​ మృతి కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విచారణలో ముంబయి పోలీసులను అంత సులువుగా నమ్మలేమని పేర్కొంది.

Mumbai Police can't be trusted: Tanushree Dutta on Sushant Singh Rajput's death case
తనుశ్రీ దత్త

'మీటూ' ఉద్యమంతో సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన నటి, మోడల్​ తనుశ్రీ దత్తా. తాజాగా సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసుపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. విచారణలో ముంబయి పోలీసులను నమ్మలేమని ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పేర్కొంది.

"ముంబయి పోలీసులు ఈ విచారణలో న్యాయపరమైన, నిష్పక్షపాతంతో వ్యవహరిస్తారనే నమ్మకం నాకు లేదు. సాధారణంగా ఇటువంటి కేసులను త్వరగా మూసేయాలని వారు చూస్తుంటారు. ప్రస్తుతం ప్రజల్లో ఇది హాట్​ టాపిక్​గా ఉండటం వల్ల.. కొంత మందిని విచారణ పేరుతో పిలిచి.. షో చేస్తున్నారు అంతే. ఒకవేళ అండర్​వరల్డ్ ప్రమేయం ఉంటే.. కచ్చితంగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలి."

-తనుశ్రీ దత్తా, సినీ నటి

బాలీవుడ్​లో తన అనుభవం గురించి మాట్లాడుతూ.. తన విషయంలోనూ నెలల తరబడి శ్రద్ధతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు నటించారని తనుశ్రీ పేర్కొంది. సుశాంత్​ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం నిజంగా బాధాకరమని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details