తెలంగాణ

telangana

By

Published : Jun 13, 2019, 7:19 PM IST

ETV Bharat / sitara

44 ఏళ్ల తర్వాత మోహన్​బాబు అలా..!

దాదాపు 44 సంవత్సరాల తర్వాత ఓ మహిళ దర్శకత్వం వహించే సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు మోహన్​బాబు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న 'సూరరై పోట్రు'(తమిళ టైటిల్​) లో ఈ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నాడని చిత్రబృందం వెల్లడించింది.

నటుడు మోహన్​బాబు

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన్​బాబు. ప్రతినాయక పాత్రల నుంచి హీరో వరకు సుమారు 500కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు.

సూర్య సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న మోహన్​బాబు

'సాలా కదూస్'తో ఆకట్టుకున్న సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకురాలు. తెలుగులో 'సాలా కదూస్​' సినిమా 'గురు' టైటిల్​తో వచ్చింది.

కథకు కీలకమైన ఓ పాత్రకు మోహన్​బాబు అయితేనే కరెక్ట్​ అని చిత్రబృందం నిర్ణయించింది. 'సూరరై పోట్రు' అనే టైటిల్​ను ఈ సినిమాకు పెట్టారు. అపర్ణా బాలమురళి హీరోయిన్.

దాదాపు 44 సంవత్సరాల తర్వాత మోహన్​బాబు.. ఓ మహిళా దర్శకురాలి సినిమాలో నటిస్తున్నాడు. గతంలో విజయ నిర్మల తెరకెక్కించిన సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడు.

ఇది చదవండి: 215 అడుగుల హీరో సూర్య కటౌట్​ను చూశారా మీరు..!

ABOUT THE AUTHOR

...view details