తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2020, 3:00 PM IST

ETV Bharat / sitara

సితార క్లాప్​తో మహేశ్ 'సర్కారు వారి పాట'

మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' సినిమా లాంఛనంగా మొదలైంది. జనవరి ప్రారంభం నుంచి చిత్రీకరణ జరగనుంది.

mahesh sarkaru vaari paata launched officially
సితార క్లాప్​తో మహేశ్ 'సర్కారు వారి పాట'

సూపర్​స్టార్ మహేశ్​బాబు కొత్త సినిమా 'సర్కారు వారి పాట' లాంఛనంగా ప్రారంభమైంది. ఆయన కుమార్తె సితార క్లాప్ కొట్టగా, సతీమణి నమ్రత కెమెరా స్విచాన్ చేశారు. జనవరి తొలివారం నుంచి షూటింగ్​ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించనుంది.

ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీత దర్శకుడు. 14 రీల్స్​ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకు మోసాల నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేశ్ 'సర్కారు వారి పాట' ప్రారంభం
కెమెరా స్విచాన్ చేసిన నమ్రత
దర్శకుడికి స్క్రిప్ట్ అందజేసిన నిర్మాతలు
చిత్రబృందంతో మహేశ్​ సతీమణి నమ్రత, కుమార్తె సితార

ABOUT THE AUTHOR

...view details