తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడు చరణ్​.. ఇప్పుడు వరుణ్​తో రొమాన్స్​!

'విన‌య విధేయ రామ' చిత్రం తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు కియారా అడ్వాణీ. తాజాగా వరుణ్​తేజ్ నటించనున్న బాక్సర్ సినిమా కోసం ఈ బాలీవుడ్​ భామను సంప్రదించిందట చిత్రబృందం.

By

Published : Nov 6, 2019, 2:40 PM IST

Updated : Nov 6, 2019, 3:08 PM IST

కియారా అడ్వాణీ

'భ‌ర‌త్ అనే నేను' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నటి కియారా అడ్వాణీ. ఆ సినిమా తర్వాత మెగాపవర్​స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ సరసన 'విన‌య విధేయ రామ'లో నటించింది. తాజాగా మెగాప్రిన్స్ వరుణ్​తేజ్​తో రొమాన్స్ చేయనుందట ముంబయి భామ.

వ‌రుణ్ క‌థానాయ‌కుడిగా 'బాక్స‌ర్‌' అనే చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం కియారాని సంప్ర‌దించిందట చిత్రబృందం. ఇందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపిందని సమాచారం. క్రీడా నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకి కిర‌ణ్ కొర్ర‌పాటి తొలిసారి ద‌ర్శ‌కత్వం వహించనున్నాడు.

కియారా అడ్వాణీ

'విన‌య విధేయ రామ'లో పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్ల మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు కియారా. ప్రస్తుతం బాలీవుడ్​లో వరుస ఆఫర్లతో బిజీగా ఉందీ ముద్దుగుమ్మ.

ప్ర‌స్తుతం ఈ సినిమా కోస‌మే వ‌రుణ్‌తేజ్ చెమట చిందిస్తున్నాడు. బాక్స‌ర్‌గా క‌నిపించ‌డం కోసం శారీర‌కంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు.

ఇదీ చదవండి: రైలులో పూజా హెగ్డేతో ప్రభాస్ లవ్​ ట్రాక్​..!

Last Updated : Nov 6, 2019, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details