తెలుగు, తమిళ భాషల్లో రానున్న తొలి కంప్యూటర్ స్క్రీన్ చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' (ఎవరు ఎక్కడ ఎందుకు). '118' సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న కె.వి. గుహన్ తెరకెక్కిస్తోన్న రెండో చిత్రమిది. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మాత. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రానున్న ఈ సినిమా థీమ్ సాంగ్ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. కథానాయకుడు, నటులు ప్రియదర్శి, సత్యం రాజేశ్ తదితరులు ఆన్లైన్ వేదికగా ముచ్చటించడం, హర్ష కిడ్నాప్ గురయ్యే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది ఈ వీడియో. మరి ఎక్కడ, ఎవరి మధ్య ఏం జరిగింది? ఎందుకు జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
'ఇందువదన' లిరికల్ ప్రోమో..
కొన్నేళ్ల విరామం తర్వాత వరుణ్ సందేశ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. 'ఇందువదన' టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. ఫర్నాజ్ శెట్టి హీరోయిన్. ఇందులోని తొలి లిరికల్ సాంగ్ 'వాడి వేడిగా'ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇప్పటివరకు కనిపించని కొత్త గెటప్లో వరుణ్ దర్శనమిచ్చారు. అభిలాష్ దర్శకత్వం వహిస్తుండగా, మాధవి నిర్మిస్తున్నారు.
20 మిలియన్ వ్యూస్
శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్స్టోరి'. సునీల్ నారంగ్ నిర్మాతగా వ్యవహరించగా.. పవన్ సీహెచ్ స్వరాలను సమకూర్చారు. ఈ సినిమాలోని 'సారంగదరియా' పాట యూట్యూబ్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుండగా.. ఇప్పుడు అందులోని మరో పాట 'నీ చిత్రం చూసినా..' సాంగ్కు యూట్యూబ్లో 20 మిలియన్ల వ్యూస్ లభించాయి. అయితే ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదలకావాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం కారణంగా అదికాస్త వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాత ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.