తెలంగాణ

telangana

By

Published : Jun 5, 2021, 9:06 AM IST

Updated : Jun 5, 2021, 9:32 AM IST

ETV Bharat / sitara

కరోనాతో 'డ్రీమ్ గర్ల్' నటి మృతి

బాలీవుడ్ నటి రింకూ సింగ్ (Rinku Singh Nikumbh) కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు చంద్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

rinku singh
రింకూ సింగ్

బాలీవుడ్ నటి రింకూ సింగ్ నికుంభ్(Rinku Singh Nikumbh) కరోనాతో కన్నుమూశారు. ఆమె సోదరుడు చంద్ సింగ్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఆమెకు ఆస్తమా ఉన్నట్లు.. ఈ క్రమంలోనే కరోనా సోకడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.

రింకూ సింగ్

"మే 25న రింకూకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఆమెకు జ్వరం ఎంతకూ తగ్గకపోవడం వల్ల ఆస్పత్రిలో అడ్మిట్ చేశాం. అసలు ఆమెకు ఐసీయూ అవసరం వస్తుందని అనుకోలేదు. మొదట రింకూను జనరల్ వార్డులో అడ్మిట్ చేశాం. రెండో రోజూ డాక్టర్లు ఐసీయూకు మార్చారు. ఆమెకు ఆస్తమా ఉంది."

-చంద్ సింగ్, రింకూ సోదరుడు

ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన 'డ్రీమ్ గర్ల్' (Dream Girl) చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు రింకూ. 'చిడియఘర్'(Chidiyaghar)​ అనే సినిమాలోనూ నటించారు. అమెజాన్ ప్రైమ్​లో ఇటీవల విడుదలైన 'హల్లో చార్లీ' (Hello Charlie) చిత్రం రింకూకు చివరిది.

ఆయుష్మాన్​తో రింకూ సింగ్
Last Updated : Jun 5, 2021, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details