తెలంగాణ

telangana

'మహానటి' దర్శకుడి మరో క్రేజీ ప్రాజెక్టు

By

Published : Aug 8, 2019, 7:21 AM IST

వైజయంతీ మూవీస్ బ్యానర్​లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. 'మహానటి' తర్వాత రాబోతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని కోసం నూతన సాంకేతిక నిపుణులు, రచయితలకు అవకాశం కల్పించనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

దర్శకుడు నాగ్​ అశ్విన్

టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​ త్వరలో పెద్ద ప్రాజెక్టుతో రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి విజువల్ ఆర్టిస్ట్స్​, డిజైనర్స్​, రచయితలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిచ్చింది నిర్మాణ సంస్థ.

"మేం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాం. కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాం. విజువల్‌ ఆర్టిస్ట్స్, డిజైనర్స్, రచయితలు ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలంటే సంబంధిత చిరునామాకు వివరాలు తెలియజేయాలి" -ట్విట్టర్​లో వైజయంతీ మూవీస్ సంస్థ

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్​లో షూటింగ్ ప్రారంభం కానుంది. రెండో చిత్రంతోనే అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు అశ్విన్. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కించి అఖండ విజయాన్ని అందుకున్నాడు.

ఇది చదవండి: మల్టీప్లెక్స్​.. దుస్తుల వ్యాపారం.. మహేశ్​బాబు తర్వాత ఆలోచనేంటీ?

ABOUT THE AUTHOR

...view details