తెలంగాణ

telangana

By

Published : May 23, 2021, 4:08 PM IST

Updated : May 23, 2021, 4:55 PM IST

ETV Bharat / sitara

బోనీ కపూర్​కు కన్నీళ్లు మిగిల్చిన తుపాను

తౌక్టే తుపాను ధాటికి బాలీవుడ్​లో పలు చిత్రాల సెట్టింగ్​లు దగ్ధమయ్యాయి. అందులో అజయ్​ దేవగణ్​ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'మైదాన్​' సినిమా సెట్స్​ కూడా ఉన్నాయి. దీనిపై నిర్మాత బోనీ కపూర్​ స్పందిస్తూ.. దాదాపుగా రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు.

Boney Kapoor fears slipping into depression thinking about erecting Maidaan set thrice
బోనీ కపూర్​కు కన్నీళ్లు మిగిల్చిన తుపాను

ఓ పక్క కరోనా చిత్రసీమను అతలాకుతలం చేస్తుంటే మరోపక్క తౌక్టే తుపాను కూడా ఇండస్ట్రీని కష్టాల్లోకి నెట్టేసింది. అకాల వర్షాలతో ముంబయి నగరం అతలాకుతలం అయ్యింది. ఈ ప్రభావం బాలీవుడ్‌పై ఎక్కువగానే కనిపిస్తుంది. పలు భారీ చిత్రాలకు నష్టాలు మిగిల్చింది తౌక్టే తుపాను. పలు సినిమాల కోసం ఇప్పటికే భారీ సెట్లు వేశారు. కరోనా కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి. ఇప్పుడు తుపాను కారణంగా తీవ్రంగా ధ్వంసంమయ్యాయి.

ముంబయిలోని ఓ స్టూడియోలో అజయ్​ దేవగణ్​ నటిస్తోన్న 'మైదాన్​' చిత్ర సెట్​ ఉంది. తుపాను కారణంగా ఆ సెట్​ కూలిపోయినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది. దీంతో దాదాపుగా రూ.30 కోట్ల వరకు నష్టపోయినట్లు నిర్మాత బోనీ కపూర్​ ఓ ప్రకటనలో వెల్లడించారు.

"మైదాన్‌' కోసం భారీ ఫుట్‌బాల్‌ స్టేడియం సెట్‌ను తీర్చిదిద్దాం. చివరి షెడ్యూల్లో భాగంగా ఇందులో 8 మ్యాచ్‌లను చిత్రీకరించాలని భావించాం. నాలుగు మ్యాచ్‌ల చిత్రీకరణ పూర్తయింది. ఇంతలోనే కరోనా రెండోదశ ప్రభావంతో అంతా ఆగిపోయింది. ఇప్పుడు తౌక్టే తుపాను దెబ్బకు సెట్‌ నాశనం అయ్యింది. ఈ పరిస్థితి చాలా భయంకరమైనది. నాకు దాన్ని పదేపదే గుర్తు తెచ్చుకోవాలని లేదు. వాటి గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు షూటింగ్​ కోసం సెట్​ మళ్లీ పునఃనిర్మించాలి. దీంతో బడ్జెట్​ మరింత పెరిగిపోతుంది. అది నా మనసులోకి వస్తే మళ్లీ నిరాశకు గురవుతాను".

- బోనీ కపూర్​, బాలీవుడ్​ నిర్మాత

అజయ్​ దేవగణ్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మైదాన్'​. ఈ ఏడాది అక్టోబర్​ 15న థియేటర్లలో విడుదల కావాలి. అయితే ఈ సినిమా ఓటీటీ వేదికగా 'పే పర్ వ్యూ' పద్ధతిలో విడుదల కానున్నట్లు కొంత కాలంగా జోరుగా ప్రచారంపై నిర్మాతలు స్పందించారు. ఈ వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. పే పర్​ వ్యూ పద్ధతిలో విడుదల చేసే ఆలోచనే లేనట్లు స్పష్టం చేశారు. ఏ ఓటీటీ ప్లాట్​ఫాం నిర్వాహకులతో ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు.

హైదరాబాద్​కు చెందిన స‌య్య‌ద్​ అబ్ధుల్ ర‌హీం జీవితాధారంగా 'మైదాన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1952 నుంచి 1963 మధ్య కాలంలో ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించింది భార‌త్. ఆ స‌మ‌యంలో భారత జ‌ట్టుకు కోచ్‌గా వ్యవహరించారు రహీం. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​, జీ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. అజయ్‌ దేవగణ్‌తో పాటు ప్రియమణి, గజ్​రాజ్​ నటిస్తున్నారు. అమిత్‌ రవీందర్‌నాథ్‌ దర్శకుడు.

ఇదీ చూడండి..చెర్రీకి జోడీగా మరోసారి బాలీవుడ్​ బ్యూటీ!

Last Updated : May 23, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details