తెలంగాణ

telangana

By

Published : Oct 21, 2019, 1:05 PM IST

ETV Bharat / sitara

'మహా'పోరు: ఓటు వేసిన బాలీవుడ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​లో బాలీవుడ్ అగ్రనటులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అగ్రనటుడు ఆమిర్ ఖాన్, రితేశ్-జెనీలియా దంపతులు, లారా దత్తా, మాధురీ దీక్షిత్ ఓటేశారు.

ఓటేసిన బాలీవుడ్

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బాలీవుడ్ తారలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్, సతీమణి కిరణ్​రావ్​తో కలసి​ బాంద్రాలోని పాలి హిల్​లో ఉదయమే ఓటేశాడు.

దివంగత కాంగ్రెస్ నేత విలాస్​రావ్​ దేశ్​ముఖ్​ కుమారుడు,బాలీవుడ్​ నటుడు రితేశ్​ దేశ్​ముఖ్​, అతడి భార్య, నటి జెనీలియా డిసౌజా లాతూర్​లో ఓటు వేశారు. రితేశ్​ సోదరులు అమిత్​, ధీరజ్ ఈ ఎన్నికల్లో లాతూర్​ నగరం, లాతూర్ గ్రామీణ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్​ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్​ భూపతి, భార్య, నటి లారా దత్తాతో కలిసి ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలో ఓటు వేశాడు.

బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంది.

నిన్నటి తరం కథానాయకుడు గోవిందా.. సతీమణి సునీతతో కలసి అంధేరీ పశ్చిమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు.

వెటరన్ నటుడు ప్రేమ్​ చోప్రా, దర్శకుడు, గీత రచయిత గుల్జార్ బాంద్రా పశ్చిమ నియోజకవర్గంలో ఓటేశారు.

నటుడు, భాజపా ఎంపీ రవికిషన్ గోరేగావ్​లో.. నటి పద్మినీ కొల్హాపురి అంధేరీ పశ్చిమ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదీ చూడండి: పోలీసుల సంక్షేమానికి తగిన చర్యలు: అమిత్​ షా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details