మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బాలీవుడ్ తారలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్, సతీమణి కిరణ్రావ్తో కలసి బాంద్రాలోని పాలి హిల్లో ఉదయమే ఓటేశాడు.
దివంగత కాంగ్రెస్ నేత విలాస్రావ్ దేశ్ముఖ్ కుమారుడు,బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్, అతడి భార్య, నటి జెనీలియా డిసౌజా లాతూర్లో ఓటు వేశారు. రితేశ్ సోదరులు అమిత్, ధీరజ్ ఈ ఎన్నికల్లో లాతూర్ నగరం, లాతూర్ గ్రామీణ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి, భార్య, నటి లారా దత్తాతో కలిసి ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలో ఓటు వేశాడు.
బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంది.