తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆదిత్య 369' సీక్వెల్​తో మోక్షజ్ఞ ఎంట్రీ

'ఆదిత్య 369' సీక్వెల్​పై స్పందించారు నటుడు బాలకృష్ణ. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కిస్తానని స్పష్టం చేశారు. ఇందులో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని వెల్లడించారు.

By

Published : Jun 10, 2021, 8:42 PM IST

balaya
బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుత పాత్రల్లో నటించారు. వాటిల్లో 'ఆదిత్య 369' ఒకటి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆణిముత్యంగా నిలిచి.. నేటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉంది. ఈ మూవీని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించారు బాలయ్య. గురువారం ఆయన బర్త్​డే సందర్భంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే 'ఆదిత్య 369' సీక్వెల్ గురించి మాట్లాడారు.

"ఆదిత్య 369'కి సీక్వెల్ ఉంటుంది. నేనే ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తా. నా తనయుడు మోక్షజ్ఞ కూడా ఇందులో నటిస్తాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది" అంటూ క్లారిటీ ఇచ్చారు బాలయ్య. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

టైమ్​ మిషన్( భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల) నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌, చరిత్ర, ప్రేమ, క్రైమ్‌లను సమ్మిళితం చేసి ఈ చిత్రాన్ని.. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. ఈ కథాంశానికి అప్పట్లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ABOUT THE AUTHOR

...view details