తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి సందడి..!

'రంగస్థలం' చిత్రంతో హిట్​ జంటగా నిలిచారు రామ్​ చరణ్, సమంత. ఈ సినిమాలో ఒకరితో ఒకరు పోటీపడి మరీ నటించారు. తాజాగా ఈ జంట మరోసారి తెరపై సందడి చేయనుందని టాలీవుడ్​ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

By

Published : Feb 11, 2020, 8:51 PM IST

Updated : Mar 1, 2020, 12:44 AM IST

As Soon As Ace Director Koratala Siva Megastar Chiranjeevi Film Took To Sets Rumours Were Rife ... Ram Charan reportedly is playing the role of a Naxalite in the upcoming movie
మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి..!

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంతో హిట్‌ జంటగా నిలిచారు రామ్‌ చరణ్, సమంత. చిట్టిబాబుగా చెర్రీ, రామలక్ష్మిగా సామ్‌ పోటీపడి మరీ నటించారు. ఈ చిత్రంలో వీళ్లద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి నటించనుందని చిత్రసీమలో వస్తోన్న వార్తలు వైరల్​ అవుతున్నాయి.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా విశ్వసనీయ వర్గాలు దాదాపు ఖరారు అంటున్నాయి. ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత కూడా నటించనుందని తెలుస్తోంది.

మరోసారి తెరపై చిట్టిబాబు, రామలక్ష్మి..!

బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ పేరు కూడా ప్రచారంలో నిలిచింది. కానీ ఆమె పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశం సమంతకు వచ్చిందట. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. చరణ్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో నక్సలైట్‌గా కనిపిస్తాడని టాక్‌. ఏది ఏమైనా చిట్టిబాబు, రామలక్ష్మి మళ్లీ కలుస్తున్నారు అనగానే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఇదీ చదవండి: ప్రభాస్​ కొత్త చిత్రం ఫస్ట్​లుక్ అప్పుడే..!

Last Updated : Mar 1, 2020, 12:44 AM IST

ABOUT THE AUTHOR

...view details