తెలంగాణ

telangana

By

Published : Mar 30, 2021, 6:36 AM IST

ETV Bharat / sitara

ఆ సినిమా నాకొక పాఠశాల అవుతుంది: పరిణీతి

'యానిమల్'​ చిత్రంలో అనిల్​ కపూర్​, రణ్​బీర్​ కపూర్​తో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది హీరోయిన్​ పరిణీతి చోప్రా. ఈ చిత్రం తనకు ఓ పాఠశాల లాంటిదని తెలిపింది.

parineeti
పరిణిత

తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న రెండో చిత్రం 'యానిమల్‌'. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రా ఎంపికైంది. తాజాగా చిత్రంపై ఆమె స్పందిస్తూ.. "ఏ దర్శకుడితోనూ నటుడుతోనూ కలిసి పనిచేయాలని ముందుగా నేనెప్పుడూ అనుకోలేదు కాబట్టే నాకు 'యానిమల్‌' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే వారి గురించి నాకు తెలుసు. 'యానిమల్‌' చిత్రంలో పనిచేయడం అంటే నాకు అదొక పాఠశాల అవుతుంది. దర్శకుడు సందీప్‌ అంటే నాకు ఇష్టం. వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడాను. చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా స్క్రిప్ట్ నాకెంతో నచ్చింది" అని తెలిపింది.

పరిణీతి చోప్రా, రణ్‌బీర్‌-అనిల్‌ కపూర్‌తో కలిసి నటించం ఇదే తొలిసారి. చిత్రంలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్‌ నటిస్తున్నారు. గుల్షన్‌ కుమర్‌, టీ-సీరీస్‌ సమర్పణలో భద్రకాళి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమాకు భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాతలు. పరిణీతి చోప్రా నటించిన 'ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై అలరించగా 'సందీప్‌ ఔర్‌ పింకీ పరార్‌', 'సైనా' చిత్రాలు మార్చిలో తెరపైకి సందడి చేశాయి.

ఇదీ చూడండి: సమీక్ష: తెరపై 'సైనా' జీవితం ప్రతిబింబించిందా?

ABOUT THE AUTHOR

...view details