తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2020, 4:50 PM IST

ETV Bharat / sitara

'రామాయణం చెయ్యాలి.. బాలయ్యతో సినిమా తీయాలి'

ఈ నెల 11న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నాడు.

Anil Ravipudi Special Interview
అనిల్ రావిపూడి

వాణిజ్యాంశాలు నిండిన వినోదాత్మక చిత్రాలకు పెట్టింది పేరు అనిల్‌ రావిపూడి. ఇప్పటి వరకు అతడి నుంచి వచ్చిన పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 అన్నీ ఈ బాటలో నడిచి విజయాలందుకున్నవే. తాజాగా ఈ సంక్రాంతికి మహేష్‌బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు అంటూ వినోదాలు పంచబోతున్నాడు. జనవరి 11న ఈ చిత్రం విడుదల కానున్న తరుణంలో మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ దర్శకుడు.

"ఇటీవల ప్రీరిలీజ్‌ ఈవెంట్లో చిరుతో దిగిన ఫొటో చూసి మా ఇద్దరి కలయికలో సినిమా వస్తుందేమోనని అంతా అనుకుంటున్నారు. ఈ స్పందన చూస్తుంటే వాళ్లే నాతో చిరుతో ఓ సినిమా చేయించేలా ఉన్నారనిపిస్తోంది (నవ్వుతూ). నిజంగా నాకు ఆయనతో పనిచేసే అవకాశమొస్తే ఎగిరి గంతేస్తా. ఆయన ఊ.. అనాలే కానీ, కథ రాయడం ఎంత సేపు. మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేస్తా. గతంలో బాలకృష్ణ సర్‌తో ఓ సినిమా అనుకున్నాం. ఆయన బిజీగా ఉన్నారు. చూడాలి ఏమౌతుందో" -అనిల్ రావిపూడి, దర్శకుడు

బాహుబలి’ స్థాయిలో భారీ ప్రాజెక్టు చేసే అవకాశముందా? అని ప్రశ్నించగా.. "నేనలాంటి పెద్ద చిత్రాలు చేయడానికి చాలా దూరంలో ఉన్నాననుకుంటున్నా. ఒకవేళ నేను నిజంగా ఆ స్థాయికి చేరుకుంటే 'రామాయణం' చేస్తా" అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు అనిల్.

ఇదీ చదవండి: సినిమా రివ్యూ: ఇది రజనీ దర్బార్​..!

ABOUT THE AUTHOR

...view details