కరోనా ప్రభావంతో క్రీడా పోటీలు, సినిమా షూటింగ్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అందుకు సంబంధించి, తన చేతిపై స్టాంప్ వేసుకున్న ఫొటోను ట్వీట్ చేశారు. నెటిజన్లకు జాగ్రత్తలు చెప్పారు.
కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాప్తిపై ఓ కవితను రాసి, పాడారు అమితాబ్. దానిని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇదే కాకుండా ప్రతి ఆదివారం తన నివాసంలో అభిమానులను కలిసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.