తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2019, 6:28 PM IST

ETV Bharat / sitara

'వెంకీమామ' దర్శకుడి చూపు బన్నీ వైపు

'వెంకీమామ'తో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు బాబీ. తన తర్వాతి చిత్రం గురించి ఇప్పటికే సినీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ డైరెక్టర్ అల్లు అర్జున్​తో ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తోంది.

allu arjun
బన్నీ

రచయితగా వెండితెరకు పరిచయమై 'పవర్‌', 'జై లవకుశ' వంటి చిత్రాలతో దర్శకుడిగానూ సత్తా చాటాడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ). ఇప్పుడు నిజ జీవిత మామా అల్లుళ్లు వెంకటేష్‌ - నాగచైతన్యలను 'వెంకీమామ' చిత్రంతో తెరపైకి తెచ్చి మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీ ఉత్సాహంలోనే తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడట బాబీ.

తాజాగా సినీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పుడీ యువ దర్శకుడి చూపు అల్లు అర్జున్‌పై పడిందట. ఇటీవలే బన్నీని కలిసిన ఈ దర్శకుడు తన స్టోరీ లైన్‌ను స్టైలిష్‌స్టార్‌కు వినిపించాడట. ఈ కథ అతడికి తెగ నచ్చినందున వచ్చే ఏడాదిలో ఈ సినిమాకు పట్టాలెక్కిద్దామని మాటిచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇవీ చూడండి.. తెలుగు 'పింక్‌'లో తెలుగమ్మాయి..?

ABOUT THE AUTHOR

...view details