తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2021, 11:42 AM IST

ETV Bharat / sitara

'ఆదిపురుష్' షూటింగ్ రీస్టార్ట్.. థ్రిల్లింగ్​గా 'కుడి ఎడమైతే'

ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆదిపురుష్'. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా తాజాగా సెట్​లో అడుగుపెట్టింది. అలాగే అమలాపాల్ ప్రధానపాత్రలో నటిస్తోన్న 'కుడి ఎడమైతే' వెబ్ సిరీస్​ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

Adipurush
ఆదిపురుష్

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌', 'ఆది పురుష్‌', 'సలార్‌' చిత్రాలన్నీ కొవిడ్‌ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులన్నీ క్రమంగా కుదుటపడుతుండటం వల్ల.. ఈ సినిమాల్ని ఒక్కొక్కటిగా తిరిగి సెట్స్‌పైకి వెళుతున్నాయి. ఇప్పటికే 'రాధేశ్యామ్'​ షూటింగ్ ప్రారంభమవగా.. 'ఆదిపురుష్' నేడు సెట్లో అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన అప్​డేట్ దర్శకుడు ఓం రౌత్​ తన ఇన్​స్టా ఖాతా ద్వారా తెలియజేశారు. అయితే ప్రభాస్ లేకుండానే ఈ చిత్రీకరణను జరపనున్నారు. 'రాధేశ్యామ్'​ షూట్ అయ్యాక డార్లింగ్​ ముంబయి పయనమవనున్నారు.

ఓం రౌత్

థ్రిల్లింగ్​ 'కుడి ఎడమైతే'

కథానాయిక అమలాపాల్‌ వెబ్‌ సిరీస్‌ల్లో మెరుస్తూనే ఉంది. ఆమె ప్రధాన పాత్రధారిగా 'కుడి ఎడమైతే' సిరీస్‌ రూపొందుతోంది. సైంటిఫిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో యువ కథానాయకుడు రాహుల్‌ విజయ్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్​కు సంబంధించిన టీజర్​ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకునేలా ఉన్న ఈ ప్రచారం చిత్రం అంచనాలు పెంచుతోంది. 'యూ టర్న్‌' ఫేమ్‌ పవన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. జులై 16 నుంచి ఓటీటీ వేదిక 'ఆహా'లో ప్రసారం కానుంది.

ఇవీ చూడండి: అందమైన భామలు.. హాట్ మెరుపు తీగలు!

ABOUT THE AUTHOR

...view details