తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2021, 4:36 PM IST

Updated : Mar 14, 2021, 4:52 PM IST

ETV Bharat / sitara

ఆస్పత్రిలో చేరిన మలయాళ ప్రముఖ నటుడు

న్యూమోనియాతో బాధపడుతున్న ప్రముఖ నటుడు సురేశ్ గోపీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే విషయంలో సందిగ్ధత నెలకొంది.

Suresh Gopi hospitalised
సురేశ్ గోపీ

మలయాళ ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్ గోపీ అనారోగ్యం పాలయ్యారు. న్యూమోనియా కారణంగా ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరారు.

'పప్పన్' షూటింగ్​లో ఉన్నప్పుడు ఆయనకు అసౌకర్యంగా అనిపించడం వల్ల తక్షణమే హాస్పిటల్​కు తీసుకెళ్లారు. గత నాలుగు రోజుల నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కేరళలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో భాజపా తరఫున ఆయనకు నెమమ్ లేదా త్రిసూర్ టికెట్​ ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో గోపీ సురేశ్ ఆస్పత్రిలో చేరడం వల్ల ఎన్నికల్లో పోటీపై సందిగ్ధత నెలకొననుంది!

Last Updated : Mar 14, 2021, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details