మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్పై ఓ క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఈనెల 29న సాయంత్రం 4.05 గంటలకు ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది.
మెగాస్టార్ 'ఆచార్య' టీజర్ అప్డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. తాజాగా ఈ సినిమా టీజర్పై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.
'ఆచార్య' టీజర్పై క్లారిటీ వచ్చేసింది
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్.. సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ విడుదలై ఆసక్తి పెంచుతుంది. వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.