తెలంగాణ

telangana

అనుమానస్పదంగా మహిళ మృతి.. కేసు నమోదు

By

Published : Sep 5, 2020, 5:41 AM IST

వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారం గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

women suspected death in ramaram
అనుమానస్పదంగా మహిళ మృతి.. కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల రామారంలో రేణుక(29) అనే వివాహిత అనుమాదస్పదంగా మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పలకు చెందిన దుంపల చిన్న సోమయ్య కుమార్తె రేణుకను... రామారానికి చెందిన సంతోష్​తో 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై రవికుమార్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details