తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆస్ట్రేలియాలో వికారాబాద్​కు చెందిన విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువకుడు బాత్​రూంలో పడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ధారూరు మండలం హరిదాస్​పల్లికి చెందిన హరీశ్​ శివశంకర్​ రెడ్డి ఆస్టేలియాలో ప్రాణాలు కోల్పోయాడు.

By

Published : Sep 21, 2020, 8:36 PM IST

ఆస్ట్రేలియాలో వికారాబాద్​కు చెందిన విద్యార్థి మృతి
ఆస్ట్రేలియాలో వికారాబాద్​కు చెందిన విద్యార్థి మృతి

వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాస్ పల్లికి చెందిన హరీశ్​ శివశంకర్​ రెడ్డి ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన సాయిరెడ్డి, నాగేంద్రమ్మల కుమారుడు హారీష్ ఉన్నత చదువు కోసం అస్ట్రేలియాకు వెళ్ళాడు. సదరన్ క్రాస్ యునివర్సిటీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

ఐదు రోజుల కిందట తలనొప్పితో బాధపడుతూ బాత్​రూంలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చూడండి:కన్నపిల్లలతో కలిసి భర్తను హత్య చేసిన భార్య...

ABOUT THE AUTHOR

...view details