తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2020, 2:50 PM IST

ETV Bharat / jagte-raho

బోధన్​లో గుర్తుతెలియని మహిళ మృతదేహం

కాళ్లు కట్టేసి, నడుం వరకు సంచిలో పెట్టి ఉంచిన ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించిన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్​ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

unidentified dead body of a woman found in bodhan
నిజామాబాద్​ జిల్లాలో మహిళ మృతదేహం

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని ఆటోనగర్​ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మహిళ వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని బోధన్ సీఐ రాకేశ్ తెలిపారు. ఆటోనగర్​లోని రాజీవ్ ​గృహకల్ప భవనం వెనకాల ఉన్న పొలంలో కాళ్లు కట్టేసి, నడుము వరకు సంచిలో పెట్టి పడేశారని వెల్లడించారు. మెడకు తాడు బిగించి ఉందని, ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details