తెలంగాణ

telangana

క్రికెట్ బెట్టింగ్​లో నష్టం.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

By

Published : Nov 11, 2020, 2:38 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ భారీగా నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు ప్రయత్నించగా.. వీరిలో ఒకరు మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

cricket betting
క్రికెట్ బెట్టింగ్​లో నష్టం.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన ఇద్దరు యువకులు... ఎలా బయటపడాలో తెలియక చావే శరణ్యమనుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరుకు చెందిన సురేష్‌, బెల్లంకొండ బుడగ జంగాల కాలనీకి చెందిన కొమరయ్య సోమవారం మధ్యాహ్నం బెల్లంకొండలోని రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లారు. దారిలో పురుగుల మందు తాగారు. క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టపోయామని, బెట్టింగ్‌ నిర్వాహకుడు డబ్బు కోసం ఒత్తిడి తేవడం వల్ల చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ బంధువులకు సెల్ఫీ వీడియో పంపారు. బంధువులు ఘటనాస్థలికి వెళ్లి ఇద్దరినీ సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సురేష్‌ చనిపోగా, కొమరయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..

ఇవీచూడండి:వనపర్తి నల్ల చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details