తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2020, 1:05 AM IST

ETV Bharat / jagte-raho

విషాదం: రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృతి

రోడ్డుప్రమాదంలో బావ, బావమరుదులు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

two died in a accident at chintapalli gate in vikarabad district
విషాదం: రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృతి

వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చింతపల్లి గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్​ ద్రిచక్ర వాహనాన్ని​ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

బొమ్మరాసిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కురువ పెద్ద మల్లప్ప, కురువ రాములు బావ, బావమరుదులు. చెట్లపల్లి గ్రామంలో తమ బంధువుల ఫంక్షన్​కు ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుండగా.. చింతపల్లి గేట్​ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. అటు పక్క నుంచి వెళ్తున్న ట్రాక్టర్ కింద పడ్డారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ బస్సులో మందుబాబుల హల్​చల్

ABOUT THE AUTHOR

...view details